ఆదిపురుష్.. ఒక్క సీక్వెన్స్ కోసమే 12 కోట్లు ఖర్చు !


రామాయణ ఇతిహాస గాథ ఆధారంగా పౌరాణిక నేపథ్యంలో ప్రభాస్ హీరోగా రూపొందుతున్న పాన్‌ ఇండియా సినిమా ఆదిపురుష్. టి. సిరీస్ బ్యానర్‌పై భూషణ్‌కుమార్‌, క్రిషన్‌కుమార్‌, ఓంరౌత్‌, ప్రసాద్ సుతార్‌, రాజేశ్‌ నాయర్‌ నిర్మిస్తున్న ఈ సినిమాకు ఓం రౌత్‌ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమాలో ప్రభాస్ రాముడిగా నటిస్తుంటే కృతి సనన్ సీతగా నటించింది. ఇక రావణాసురిడిగా సైఫ్ అలీ ఖాన్ నటిస్తున్నాడు. హేమా మాలిని, సన్నీ సింగ్ ప్రధాన పాత్రల్లో నటించారు.

అయితే, ఈ సినిమాలో హైలైట్ సీక్వెన్స్ గురించి ఒక అప్ డేట్ తెలుస్తోంది. క్లైమాక్స్ కి ముందు వచ్చే ఓ సీక్వెన్స్ లో ప్రభాస్ రావణుడికి సంబధించిన రాక్షసులు పై చేసే యుద్ధం సన్నివేశం మెయిన్ హైలైట్ గా ఉంటుందట. ఈ ఒక్క సీక్వెన్స్ కోసమే ఆదిపురుష్ టీమ్ ఏకంగా 12 కోట్లు ఖర్చు చేసిందని టాక్. సముద్రంలో జరిగే ఈ యుద్ధం విజువల్స్ ప్రేక్షకులకు 3డి లో అద్భుతమైన అనుభూతిని ఇస్తాయట. మరి అన్ని కోట్లు ఖర్చు పెట్టిన ఈ సీక్వెన్స్ ఏ లెవెల్ లో ఉంటుందో చూడాలి మరి.