భద్ర, తులసి, సింహా సినిమాలతో హ్యాట్రిక్ కొట్టి… టాప్ దర్శకుల జాబితాలో చేరిపోయారు బోయపాటి శ్రీను. దమ్ములో ఎన్టీఆర్ని దమ్మున్న హీరోగా చూపించారు. ఇప్పుడు బాలకృష్ణతో రెండోసారి జత కట్టడానికి ప్రణాళికలు వేసుకొంటున్నారు. బాలకృష్ణ ను బోయపాటి రూలర్గా చూపించబోతున్నారు. ”బాలయ్య అభిమానులకు ఏం కావాలో నాకు తెలుసు. వానికి అన్ని విధాలా సంతృప్తి పరిచే సినిమా అవుతుంది. యాక్షన్ ఒక్కటే కాదు… మానవ సంబంధాలు కూడా సినిమాకి చాలా కీలకం. అవి రెండూ ఉంటూనే డ్రామా పండుతుంది. బాలకృష్ణ సినిమాలో ఇవన్నీ ఉండేలా జాగ్రత్త పడుతున్నా. డబ్బుల కోసం అయితే చకచక సినిమాలు తీసేసేవాడిని. కానీ నా ఆశయం బ్యాంకు బాలెన్సులు పెంచుకోవడం కాదు. నలుగురినీ సంతోషపెట్టే సినిమా తీయాలి.. నా కోసం కాదు..” అంటున్నారాయన. వరుస విజయాలతో దూసుకుపోతున్న ఈ దర్శకుడి జన్మదినం నేడు (25 ఏప్రిల్). ఈ దర్శకుడికి తెలుగు మిర్చి మనస్ఫూర్తిగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తోంది.