వీరు.. వీరవిహారం ఢిలీ బోణీ !

delhiఐపిల్-6 లో ఢిల్లీ డేర్ డెవిల్స్ ఎట్టకేలకు బోణి కొట్టింది. అది కూడా బలమైన ముంబాయి జట్టుపైన. లేటుగా నైనా లెటెస్ట్ గా.. అన్నట్టు.. 9వికెట్ల తేడాతో ముంబాయి ని చిత్తుచేసింది. ముందుగా బ్యాటింగ్ చేసిన ముంబాయి 161 పరుగులు చేసింది. సచిన్ 54, రోహిత్ శర్మ 73 పరుగులు చేశారు. 162 పరుగుల లక్ష్యంతో.. బరిలోకి దిగిన ఢిల్లీ వీరు.. ఆకాశమే హద్దుగా చెలరిగిపోయాడు. కేవలం 57 బంతుల్లోనే 95 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు. వీరుకు తోడు జయవర్థనే 59 పరుగులు చేయడంతో.. ఢిల్లీ గ్రేట్ విక్టరీని సాధించింది. వీరూ.. రెచ్చిపోతే ఎలా ఉంటుందో ఈ మ్యాచ్ ద్వారా మరోసారి రుజువయిందని క్రికెట్ విశ్లేషకులు అంటున్నారు.