కేసీఆర్ కు సవాల్ విసిరిన పొంగులేటి!

kacr ponuletiకాంగ్రెస్ నేత పొంగులేటి సుధాకరరెడ్డి టీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ పై తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు. బయ్యారం గనులపై బహిరంగ చర్చకు రావాలని కేసీఆర్ కు పొంగులేటి సవాల్ విసిరారు. బయ్యారం వద్ద ఏర్పాటు చేస్తున్న ఉక్కు ఫ్యాక్టరీపై టీఆర్ఎస్ తప్పుడు ప్రచారం చేస్తోందన్నారు. ఖమ్మం జిల్లాలోనే ఫ్యాక్టరీ ఏర్పాటుకు ఆర్ఐఎన్ఎల్ తో ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుందని తెలిపారు. వాస్తవాలు తెలుసుకోకుండా రాజకీయ ప్రయోజనం కోసం కేసీఆర్ మాట్లాడుతున్నారన్నారు. పారిశ్రామికవేత్తలతో కేసీఆర్ కుమ్మక్కై తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. బయ్యారంపై కేసీఆర్ తమతో చర్చకు సిద్ధపడితే అనుమానాలు నివృత్తి చేస్తామన్నారు.