మే 24 న ‘ఇద్దరమ్మాయిలతో..’

iddarammailatho‘ఇద్దరమ్మాయిలతో.. ’ అల్లు అర్జున్ మే 24 న వచ్చేస్తున్నాడు. పూరి జగన్నాథ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం మొదట్లో మే 10న విడుదల చేయడానికి సన్నాహాలు చేసినప్పటికినీ, అనివార్య కారణాలతో.. మే 24 కి వాయిదా పడింది. అంతేకాకుండా రేపు జరగాల్సిన ఆడియో ఫంక్షన్ రద్దయిన సంగతి తెలిసిందే. త్వరలోనే ఆడియో వేడుక తేదిని ప్రకటించనున్నట్లు చిత్ర బృందం తెలిపింది. ఈ సినిమా రిచ్ గా రావడానికి బాలీవుడ్ సాంకేతిక నిపుణులతో.. పూరి ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారు. అమలాపాల్, కేథరిన్ థ్రెసా కథానాయికలుగా నటిస్తున్న ఈ చిత్రాన్ని బండ్ల గణేష్ నిర్మిస్తున్నారు.