తెలంగాణలోనే బయ్యారం స్టీల్ !

telanganaబయ్యారం గనులపై ప్రతిపక్షాల మూకుమ్మడి దాడితో ప్రభుత్వం ఎట్టకేలకు దిగివచ్చింది. “బయ్యారం ఉక్కు.. తెలంగాణ హక్కు” అని తెరాస నేతలు పిలుపునివ్వడం.. వారికి తెదేపా, వైకాపా నేతలు తోడవ్వడంతో.. ప్రభుత్వం ఆత్మరక్షణలో పడింది. ఈ నేపథ్యంలో.. ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఖమ్మం జిల్లాలో ఉక్కు కర్మాగారాన్ని నెలకొల్పాలని నిర్ణయించింది. దాంతో పాటు ఉక్కు శుద్ధి కర్మాగారాన్ని కూడా బయ్యారంలోనే ఏర్పాటు చేయనున్నట్టు మంత్రి భట్టి విక్రమార్క తెలిపారు. కాగా, కాంగ్రెస్ ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకరరెడ్డి మాట్లాడుతూ.. బయ్యారం వద్ద ఉక్కు కర్మాగారం ఏర్పాటుకు సీఎం సుముఖత వ్యక్తం చేశారని వెల్లడించారు. దీనిపై టీఆర్ఎస్, టీడీపీ రాద్ధాంతం చేస్తున్నాయని విమర్శించారు.