దేశ రాజధాని ఢిల్లీలో అయిదేళ్ల చిన్నారిపై అత్యాచార ఘటనను నిరసిస్తూ.. వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ నిరసన తెలిపింది. “మరో ప్రజా ప్రస్థానం” పాదయాత్రలో భాగంగా కృష్ణాజిల్లా అనిగండ్లపాడులో ఈరోజు (శనివారం) వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ, షర్మిల,పార్టీ నేతలు నోటికి నల్ల రిబ్బన్లు కట్టుకుని పది నిమిషాల పాటు నిరసన తెలియచేశారు.