బాలీవుడ్ లో ఇలియానా పంట పండింది. అక్కడ క్రేజీ ప్రాజెక్టులు సొంతం చేసుకొంటోంది. కరీనాకపూర్ చేయాల్సిన సినిమా ఇలియానా చేతికి చిక్కింది. అదే.. గబ్బర్. చిరంజీవి నటించిన ఠాగూర్ ని హిందీలో రీమేక్ చేస్తున్నారు. అక్షయ్ కుమార్ కథానాయకుడు. ఈ చిత్రానికి క్రిష్ దర్శకత్వం వహిస్తారు. సంజయ్ లీలా బన్సాలీ నిర్మాత. ఈ సినిమా కోసం తొలుత కరీనాకపూర్ ని సంప్రదించారు. ఆమె నో చెప్పడంతో ఆ అవకాశం ఇలియానాను వరించింది. బాలీవుడ్ లో గబ్బర్ ఇలియానికి మూడో చిత్రం.