మాయమైన ముఖ్యమంత్రి !

cm-kiran-missingఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం కిరణ్ కుమార్ రెడ్డి రెండుగంటల పాటు మాయమైయ్యారు. ఎవరికీ సమాచారం ఇవ్వకుండా సీఎం ప్రైవేటు వాహనంలో ఏపీ భవన్ నుంచి వెళ్లిపోయారు. సెక్యూరిటీ లేకుండా సీఎం రెండు గంటల పాటు అదృశ్యమవ్వడం చర్చనీయాంశంగా మారింది. అయితే ఈ రెండు గంటలపాటు సీఎం కిరణ్ ఎక్కడికి వెళ్లారు? ఎవరిని కలిశారు? అనే అంశంపై కాంగ్రెస్ నేతలు గుసగుసలాడుతున్నారు. సీఎం తన వర్గంవారితో.. స్వంత మంత్రివర్గాన్ని ఏర్పాటు చేసుకోవాలని భావిస్తున్న నేపథ్యంలో.. రాహూల్ తో భేటికి ముందు ఆయన తాననుకున్నది ఓకే చేయించుకునేందుకు పార్టీపెద్దలను కలిసారనే ప్రచారం జరుగుతోంది. అయితే రహస్యంగా ఎందుకు అంటే అనుకున్నవి కావాలంటే ఆమ్యామ్యాలు ఇచ్చుకోవాలిగా అందుకే ఇదంతా అంటున్నాయి రాజకీయ వర్గాలు.

మరోవైపు ఏపీ భవన్ వర్గాలు మాత్రం సీఎం తన మిత్రుడు అజారుద్దీన్ ను కలవడానికి వెళ్లినట్లు పేర్కొన్నాయి. అయితే మిత్రుడిని కలుసుకునేందుకు సీఎం ప్రవేట్ వాహనంలో.. అంత హడావుడిగా వెళ్లడం ఏంటనే సందేహాలు కూడా తలెత్తుతున్నాయి. అయినా అజారుద్దీన్ ని ఇంత అర్జెంటుగా, రహస్యంగా కలవాల్సిన అవసరం ఏముందని పార్టీ వర్గాలు పశ్నిస్తున్నాయి. ఏదో మాయ చేసే అంశంపై చర్చించడానికే సీంఎం కిరణ్ రెండుగంటల పాటు మాయమై ఉంటాడని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.