సాగర తీరంలో.. బాబు పాదయాత్ర ముగింపు !

vasthunna-meekosamతెదేపా అధినేత నారా చంద్రబాబు నాయుడు ఆరున్నర నెలలుగా అలుపెరుగకుండా కొనసాగిస్తున్న “వస్తున్నా.. మీకోసం” పాదయాత్ర ముగింపు దశకు చేరుకుంది. ప్రస్తుతం విశాఖ జిల్లాలో బాబు పాదయాత్ర కొనసాగుతుంది. ఈ నెల 27న తన సుదీర్ఘ ప్రస్థానానికి బాబు ముగింపు పలకనున్నారు. దీనికోసం పాదయాత్ర ముగింపు రోజున వైజాగ్ లో భారీ బహిరంగ సభ నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. “వస్తున్నా.. మీకోసం” పాదయాత్ర ముగింపు సభకు సంబంధించిన వివరాలను విశాఖ నగర టీడీపీ అధ్యక్షుడు వాసుపల్లి గణేష్ కుమార్ వెల్లడించారు. బాబు చారిత్రాత్మక “వస్తున్నా.. మీకోసం” పాదయాత్రకు ప్రతీకగా విశాఖలో ఓ పైలాన్ ను అధినేత ఆవిష్కరించబోతున్నట్లు గణేష్ తెలియజేశారు. దాదాపు 10వేల వాహనాలతో భారీ ర్యాలీతో బాబును సభా వేదిక వద్దకు తోడ్కొని పోతామని గణేష్ తెలిపారు. కాగా, ఈ నెల 27న పాదయాత్ర ముగింపుకు సంబంధించి బాబు పార్టీ నాయకులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా రాష్ర్టంలో తాజా రాజకీయ పరిణామాలపై కూడా బాబు నాయకులతో చర్చించారని సమాచారం.