నేనూ, అభిమానులూ వేరు కాదు: చిరంజీవి

gouravamనేను ఏ హోదాలో ఉన్నా దానికి కార‌ణం అభిమానులే! నా వెనుక కోట్లాది మంది అభిమానుల అండ‌దండ‌లు ఉన్నాయి కాబ‌ట్టే… నాకు ఈ గౌర‌వం ద‌క్కుతోంది.. అంటున్నారు చిరంజీవి. మంగ‌ళ‌వారం రాత్రి చిరంజీవి.. అల్లు శిరీష్‌ ని అభిమానుల‌కు ప‌రిచ‌యం చేశారు. ఈ సంద‌ర్బంగా మాట్లాడుతూ “దాదాపు మూడు ద‌శాబ్దాలుగా న‌న్ను ఆద‌రిస్తూ వ‌చ్చారు. నా కుటుంబం నుంచి ఎవ‌రొచ్చినా ప్రేమించారు. ఇప్పుడు శిరీష్ అడుగుపెడుతున్నాడు. వాడినీ ఆశీర్వదించండి. నేనూ ఫ్యాన్ వేరు కాదు. మీరంతా మా కుటుంబంలోని స‌భ్యులే. రామ్‌ చ‌ర‌ణ్‌, ప‌వ‌న్ క‌ల్యాణ్‌, బ‌న్నీ.. ఈ ఎదుగుద‌ల‌లో మీరూ ఉన్నారు. గౌవ‌రం ట్రైల‌ర్లు చూశా. చాలా బాగున్నాయి. ఓ డిఫ‌రెంట్ స‌బ్జెక్ట్‌ ను ఎంచుకొన్నాడు. తొలి అడుగులోనే విజ‌యం సాధిస్తాడ‌నే న‌మ్మకం ఉంద‌“ని అభిలాషించారు. ఈ కార్యక్రమంలో అల్లు అర్జున్‌, శిరీష్‌, అర‌వింద్ పాల్గొన్నారు. గౌర‌వం సినిమా ఈనెల 19న విడుద‌ల కానుంది.