అక్రమాస్తుల కేసులో సీబీఐ విచారణ ఎదుర్కొంటున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్ పై తీవ్రస్థాయి లో విరుచుకుపడ్డారు రాష్ట్ర ఆర్ధిక శాఖ మంత్రి ఆనం రామనారాయణ. నెల్లూరులో మీడియాతో మాట్లాడిన అనం, జగన్ పైన ఆయన కుటుంబం పైన సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆనం మాట్లాడుతూ…అక్రమాస్తుల కేసులో సీబీఐ విచారణ ఎదుర్కొంటున్న జగన్ కు ఉరివేసినా ఫరవాలేదని అన్నారు. చంచల్ గూడ జైలును పార్టీ కార్యాలయంలా మార్చేసి రాష్ట్ర వ్యాప్తంగా దురాగతాలకు పాల్పడుతున్నారని ఆయన ఆరోపించారు. జగన్ కుటుంబ సభ్యులు మొసలి కన్నీరు కారుస్తూ ప్రజలను ఏమార్చేందుకు ప్రయత్నిస్తున్నారని ఆనం విమర్శించారు. జగన్ బావ బ్రదర్ అనిల్ కుమార్ సైతం తనవంతుగా భూకబ్జాలకు పాల్పడుతూ, నిరుపేదల స్థలాలను ఆక్రమించి ప్రార్థనామందిరాలు నిర్మిస్తున్నాడని ఆరోపించారు. జగన్ వల్ల అనేక నిరుపేద కుటుంబాలు బలయ్యాయని తీవ్ర స్థాయి లో ద్వజమెత్తారు.