నరేష్ కథానాయకుడిగా ఓ త్రీడీ చిత్రం రూపుదిద్దుకొంటోంది. అదే… యాక్షన్ .., విత్ ఎంటర్టైన్ మెంట్ అనేది ఉపశీర్షిక.., దూకుడు నిర్మాత అనిల్ సుంకర ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయం అవున్నారు. ఈసినిమా ఫస్ట్లుక్ ఉగాది రోజున విడుదల చేశారు, సినిమాకి తగినట్టే ఈ ఫస్ట్ లుక్ కూడా జిగేల్ మనేలా తీర్చిదిద్దారు. ఈ ఫస్ట్లుక్ చిత్ర సీమలో హాట్ టాపిక్ కావడం ఖాయంగా కనిపిస్తోంది. యాక్షన్ చిత్రీకరణ పూర్తిచేసుకొంది. మేలో ఈ చిత్రాన్ని విడుదల చేయాలని నిర్మాతలు భావిస్తున్నారు. కిక్ శ్యామ్, వైభవ్, రాజు సుందరం ప్రధాన పాత్రలో పోషిస్తున్నారు.