మ‌హేష్ అతిథిగా…

maheshకృష్ణ అల్లుడు సుదీర్ బాబు క‌థానాయ‌కుడిగా న‌టించిన చిత్రం ఒక ప్రేమ‌క‌థా చిత్రమ్‌.., దర్శకుడు మారుతి ఈ చిత్రానికి నిర్మాత‌గా వ్యవహరించారు. క‌థ‌, మాట‌లూ ఆయ‌నే అందించారు. మారుతి సినిమాల‌కు కెమెరామెన్‌గా ప‌నిచేసిన ప్రభాకర్ రెడ్డి దర్శకత్వం వ‌హిస్తున్నారు. ఈ చిత్రంలోని పాట‌లు శుక్రవారం రాత్రి హైద‌రాబాద్ లోని శిల్పా కళా వేదిక‌లో విడుద‌ల కానున్నాయి. ఈ కార్యక్రమానికి మ‌హేష్‌బాబు ముఖ్య అతిథిగా విచ్చేస్తారు. కృష్ఱ దంప‌తుల‌తో పాటు… ప‌లువురు ప్రముఖులు ఈ కార్యక్రమానికి హాజ‌ర‌వుతారు.