పవన్ రచ్చ మొదలౌతుంది!

Pawan-Kalyanసంపత్ నంది దర్శకత్వంలో పవన్ కల్యాణ్ హీరోగా ఓ సినిమా తెరకెక్కబోతుంది. ఇందుకు సంభందించిన స్క్రిప్ట్ కూడా రెడీగా వుంది. తాజాగా ఈ చిత్రం షూటింగ్ డేట్స్ ని కూడ ఫిక్స్ చేశారు. ఈ చిత్రం మే రెండవ వారంలో సెట్స్
పై కి వెళ్లనుంది. కాజల్ ని హీరోయిన్ గా అనుకుంటున్నారు. ఈ సినిమాని పవన్ కళ్యాణ్ క్లోజ్ ఫ్రెండ్ శరత్ మరార్ నిర్మిస్తున్నాడు. ప్రస్తుతం ఈ సినిమాకు సంబందించిన ప్రీ – ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. చోటా
మేస్త్రి అనే టైటిల్ ని పరిశీలిస్తున్నారు. ఈ సినిమా స్క్రిప్ట్ ని అందరికి నచ్చే విదంగా రూపొందించినట్లు దర్శకుడు సంపత్ ఇప్పటికే తెలియజేశాడు. రచ్చ చిత్రం తర్వాత దర్శకుడు సంపత్ నంది మరే చిత్రం అంగీకరించకుండా పవన్ కోసం ఈ స్టొరీ రెడీ చేశాడు. ప్రస్తుతం పవన్ త్రివిక్రమ్ తో ‘సరదా’ చేస్తున్నాడు. ఈ చిత్రం వేసవి కి ధియేటర్స్ లో సందడి చేయనుంది.