వారిని తొలగించాల్సిందే : తెదేపా

tdp-Signature-Collection-onరాష్ర్ట హోం మంత్రి సబితా ఇంద్రా రెడ్డిని సీబీఐ జగన్ అక్రమాస్తుల కేసులో ఏ4 నిందితురాలిగా పేర్కొన్న నేపథ్యంలో.. ప్రతిపక్షాలు ముఖ్యమంత్రిపై ముప్పేట దాడికి దిగాయి. తెదేపా సీనియర్ నేతలు ముద్దుకృష్ణమ నాయుడు, బొజ్జల గోపాలకృష్ణా రెడ్డి, రావులపాటి చంద్రశేఖర రెడ్డిలు బుధవారం ఎన్టీఆర్ భవన్ లో విలేకరులతో మాట్లాడుతూ.. 24 గంటల్లోగా మంత్రివర్గంలోని కళంకిత తొలగించాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో.. సీఎం ఇంటిని ముట్టడిస్తామని హెచ్చరించారు. అవినీతి మంత్రులకు సీఎం వత్తాసుపలకడం ఏంటని తెదేపా నేతలు ప్రశ్నించారు. అవినీతి మంత్రులతో నిండిన కిరణ్ మంత్రివర్గానికి పాలించే హక్కును కోల్పోయిందని తెదేపా నేతలు స్పష్టం చేశారు.