బంద్ పోయే… కోర్టులకొచ్చే..!

M-Kodandaram-and-TRS-MLA-Etela-Rajenderసడక్ బంద్ కేసులో తెలంగాణ రాజకీయ జేఏసీ, తెరాస నేతలు ఈరోజు అలంపూర్ కోర్టుకు హాజరయ్యారు. రిమాండ్ ముగియడంతో.. జేఏసీ ఛైర్మెన్ కోడండరాం, శ్రీనివాస రెడ్డి, ఈటెల, జూపల్లి తదితరులు న్యాయస్థానానికి హాజరయ్యారు. తెలంగాణ రాజకీయ జేఏసీ ఆధ్వర్యంలో మార్చి 21 చేపట్టిన సడక్ బంద్ సందర్భంగా.. అరెస్టయిన జేఏసీ, తెరాస నేతలు రెండు రోజులు జైలులో గడిపిన అనంతరం బెయిల్ పై విడుదలైన విషయం తెలిసిందే.