వైఎస్ ఆత్మతో.. టీఆర్ ఎస్ కు సంబంధాలు !

madhuyaskhiవైఎస్ రాజశేఖర రెడ్డి ఆత్మబంధువుగా పిలవబడే కేవీపీ రామచంద్రరావుపై నిజామాబాద్ ఎంపీ మధుయాష్కీ మరోసారి తీవ్ర ఆరోపణలు చేశారు. హైదరాబాద్ లో యాష్కీ విలేకరులతో మాట్లాడుతూ.. వైఎస్ హయాంలో.. ప్రభుత్వ సలహాదారుగా పనిచేసిన కేవీపీని జైల్లో పెట్టి విచారిస్తేనే జగన్ అక్రమాలన్నీబయటకు వస్తాయన్నారు. రాజ్యసభ సభ్యుడు కేవీపీతో టీఆర్ ఎస్ కు మంచి సంబంధాలే ఉన్నాయని ఆయన అన్నారు. కేవీపీతో పాటుగా, రాష్ట్ర మంత్రులు కొందరు జగన్ కి కోవర్టులుగా పనిచేస్తున్నారని యాష్కీ ఆరోపించారు. 2014 ఎన్నికలకు ముందే తెలంగాణ సాధించుకోవాలని యాష్కీ సూచించారు. అయితే శీతాకాల సమావేశాల్లోపే తెలంగాణపై కేంద్రం ఓ నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.