విద్యుత్ ఛార్జీల పెంపుపై హైకోర్టులో ‘పిల్’

PIL-on-power-tariff-hike (1)విద్యుత్ ఛార్జీలను పెంచుతూ.. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై హైకోర్టులో ప్రజాప్రయోజనాల వ్యాజ్యం దాఖలైంది. విద్యుత్ నియంత్రణ మండలి ప్రకటించిన కొత్త విద్యుత్ ఛార్జీలను సవాలు చేస్తూ.. సీనియర్ అడ్వకేట్ రామచంద్రారావు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ‘ఎపిఇఆర్ సి’ జారీ చేసిన అన్ని జీవోలపై స్వతంత్ర బృందంతో దర్యాప్తు జరిపించాల్సిందిగా ఆయన పిటిషన్ లో డిమాండ్ చేశారు. కాగా, రామచంద్రా రావు హైకోర్టుకు సమర్పించిన పిల్ లో రాష్ట్ర ప్రభుత్వం, ఏపీ ట్రాన్స్ కో తో సహా ఆరుగురిని ప్రతివాదులుగా చేర్చినట్లు తెలుస్తోంది.