`వీ వాంట్ బ్యాడ్ బోయ్స్` అంటూ బిజినెస్మేన్లో అదరగొట్టింది.. శ్వేతా భరద్వాజ్. ఇప్పుడు సుశాంత్తో సరసాలాడేస్తోంది. అడ్డా సినిమా కోసం. కాళిదాస్ సినిమాతో ఎంట్రీ ఇచ్చిన అక్కినేని హీరో.. సుశాంత్. ఇప్పటి వరకూ ఆయన ఖాతాలో ఒక్క హిట్ కూడా లేదు. ఆ లోటు తీర్చుకోవడానికి అడ్డాతో ముస్తాబవుతున్నాడు. జి.కార్తీక్ రెడ్డి దర్శ్తకత్వం వహిస్తున్న చిత్రమిది. శాన్వి కథానాయిక. శ్వేతా భరద్వాజ్ ఓ ప్రత్యేక గీతంలో కనువిందు చేయనుంది. `పిల్లడ పిల్లడ మన్మధుడి మేనల్లుడా` అంటూ సాగే గీతాన్ని అన్నపూర్ణ స్టూడియోస్లో తెరకెక్కిస్తున్నారు. రామ జోగయ్య శాస్త్రి రచించిన ఈ పాటకు గణేష్ మాస్టర్ నృత్యరీతులు సమకూరుస్తున్నారు. అనూప్ సంగీతం అందించిన ఈ చిత్రంలోని గీతాల్ని త్వరలో విడుదల చేయనున్నారు. వేసవిలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తుంది.