జల్సా సినిమాకి వాయిస్ ఓవర్ ఇచ్చారు మహేష్బాబు. అది త్రివిక్రమ్తో వున్న స్నేహం వల్లే. ఇప్పుడు శ్రీను వైట్లతో వున్న అనుబంధం వల్ల…. బాద్షా చిత్రానికి గొంతు సాయం చేశారు. కథని, పాత్రల్ని ప్రేక్షకులకు పరిచయం చేయడానికి శ్రీనువైట్ల వాయిస్ ఓవర్ని ఆశ్రయిస్తారు. సాధారణంగా ఆయన సినిమాలకు ఆయన గొంతే వినిపిస్తుంది. ఈసారి మాత్రం మహేష్తో వాయిస్ ఓవర్ చెప్పించారు. ఈ సినిమా ఓపెనింగ్కి రామ్చరణ్ వెళ్లి క్లాప్ కొట్టారు. ఇప్పుడు మహేష్ గొంతు సాయం చేశారు. చూస్తుంటే…. కథానాయకుల మధ్య మంచి రేపో పెరుగుతున్నట్టు కనిపిస్తోంది. పరిశ్రమకు మంచి రోజులు వచ్చినట్టేనా..?