అప్పుడే లాభాలా..అదేంటి తేజు…?

చిత్రలహరి , ప్రతి రోజు పండగే చిత్రాలతో మెగా హిట్స్ అందుకున్న సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ ప్రస్తుతం ‘సోలో బ్రతుకే సో బెటర్’ చిత్రం చేస్తున్నాడు. శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర LLP బ్యానర్‌పై BVSN ప్రసాద్ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని సుబ్బు డైరెక్ట్ చేస్తున్నాడు. సుబ్బు చిత్రానికి ఇది మొదటిది కావడం విశేషం. నభా నటేష్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. మే 01 న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ మూవీ అప్పుడే లాభాల బాట పట్టినట్లు ఫిలిం సర్కిల్లో మాట్లాడుకుంటున్నారు.

ప్రతిరోజూ పండగే చిత్రంతో 35 కోట్ల షేర్ మార్క్ ను కూడా టచ్ చేయడంతో సోలో బిజినెస్ ఓ రేంజ్ లో సాగుతుందట. తాజాగా నాన్ థియేట్రికల్ డీల్స్ ను నిర్మాత క్లోజ్ చేసినట్లు తెలుస్తుంది. దాదాపు 10 కోట్లకు ఈ రేటు పలికిందిట. సినిమా బడ్జెట్ 20 కోట్ల లోపే ఉంటుందని, రిలీజ్ సమయానికి నిర్మాత టేబుల్ ప్రాఫిట్స్ అందుకోవడం ఖాయమని చెబుతున్నారు. సినిమా కూడా బాగా వస్తోందని, దీంతో తేజ్ హ్యాట్రిక్ హిట్స్ పూర్తి చేస్తాడని చెబుతున్నారు. థమన్ మ్యూజిక్, వెంకట్ సి దిలీప్ ఫోటోగ్రఫీ, నవీన్ నూలి ఎడిటింగ్, అవినాష్ కొల్లా ప్రొడక్షన్ డిజైనింగ్ అందించనున్నారు.