కలెక్షన్ కింగ్ మోహన్ బాబు కు భక్తవత్సలం నాయుడు అనే ఎందుకు పేరు పెట్టారో చాలామందికి తెలియదు. తనకు ఆ పేరు ఎందుకు పెట్టారో శివరాత్రి సందర్బంగా అభిమానులకు తన ట్విట్టర్ ద్వారా తెలియజేసారు. తాను ఆ పరమేశ్వరుడి ఆశీస్సులతో పుట్టానని చెప్పారు. ఈ మేరకు ట్విట్టర్ ద్వారా ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.
‘‘మహాశివరాత్రి అత్యద్భుతమైన రోజు. ముఖ్యంగా మా కుటుంబం గుర్తుపెట్టుకోవల్సిన రోజు. ఎందుకంటే మాది తిరుపతి-కాళహస్తిల మధ్య చిన్న పల్లెటూరు మోదుగుళ్లపాలెం. మా అమ్మానాన్నలకు వివాహమై ఎన్నో ఏళ్ళు సంతానం కలగకపోతే ఎవరో చెప్పారట, ఇక్కడకి ఒక 5 కిలోమీటర్లు నడిచి, మరో 5 కిలోమీటర్లు కొండెక్కితే అడవిలో బత్తినీయస్వామి అని లింగాకారంలో ఉన్నటువంటి ఈశ్వరునికి మొక్కుకుంటే పిల్లలు పుడతారని.
ఆ భగవంతుడిని దర్శించుకుని వచ్చారు, మా అమ్మకు ఐదుగురు సంతానం కలిగారు. అందుకనే నా పేరు భక్తవత్సలం అని పెట్టారు మా నాన్నగారు. ఆ తర్వాత సినిమా ఇండస్ట్రీకి వచ్చాక మోహన్ బాబుగా మారింది. అదీ రహస్యం, నాకు ఈశ్వరుడికి ఉన్న అనుబంధం. ఆయన ఆశీస్సులతో పుట్టినవాడిని నేను, మా కుటుంబమంతా ఆయన ఆశీస్సులతో పుట్టినవాళ్ళమే. అందుకు మహాశివరాత్రి చాలా మంచి పర్వ దినం. అందరికీ ఆ పరమేశ్వరుని కరుణ కటాక్షాలు కలగాలని కోరుకుంటూ – మీ మోహన్ బాబు’’ అని ట్వీట్లో పేర్కొన్నారు.
అడవిలో బత్తినీయస్వామి అని లింగాకారంలో ఉన్నటువంటి ఈశ్వరునికి మొక్కుకుంటే పిల్లలు పుడతారని. ఆ భగవంతుడిని దర్శించుకుని వచ్చారు, మా అమ్మకు ఐదుగురు సంతానం కలిగారు. అందుకనే నా పేరు భక్తవత్సలం అని పెట్టారు మా నాన్నగారు. ఆ తర్వాత సినిమా ఇండస్ట్రీకి వచ్చాక మోహన్ బాబుగా మారింది.
— Mohan Babu M (@themohanbabu) February 21, 2020