అతనొక్కడే, కిక్ , రేసుగుర్రం, సైరా సినిమాలతో స్టైలిష్ డైరెక్టర్ గా పేరును తెచ్చుకున్న సురేందర్ రెడ్డి.. సైరా హిట్ తర్వాత సాహో హీరో ప్రభాస్ తో సినిమా చేయాలనీ గట్టిగానే ట్రై చేసాడు. ఓ కథను సైతం వినిపించాడు. కానీ ప్రభాస్ పాన్ మూవీ గా కథ లేదని సూరి కి నో చెప్పాడు. దీంతో సూరి ..అదే కథను మెగా హీరో వరుణ్ తేజ్ కు చెప్పి ఓకే చేయించుకున్నాడు. ఈ సినిమాని ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్స్ బేనర్పై రాజీవ్ రెడ్డి నిర్మించనున్నట్టు ప్రచారం జరిగింది.
ప్రస్తుతం వరుణ్ చేస్తున్న బాక్సర్ పూర్తీ కాగానే ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లబోతుందని మొన్నటివరకు ప్రచారం జరిగింది. కానీ ఇప్పుడు వరుణ్..సూరి కి ఈ సినిమా చేయను అని చెప్పినట్లు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. సైరా పారితోషికం విషయంలో నిర్మాత రామ్ చరణ్ లతో సూరి ఘర్షణ పడ్డారని.. కొణిదెల ప్రొడక్షన్స్ అధినేత చరణ్ పై దర్శకసంఘం- నిర్మాతల మండలి లో ఫిర్యాదు చేశారని ఇటీవల ప్రచారమైంది. ఆ క్రమంలోనే మెగా ప్రిన్స్ తో సూరి డీల్ క్యాన్సిల్ అయ్యిందని చెబుతున్నారు. మరి ఈ వార్త నిజామా..కదా అనేదానిపై క్లారిటీ రావాల్సి ఉంది.