సైరా నరసింహ రెడ్డి తో యావత్ ప్రేక్షకులను ఆకట్టుకున్న మెగాస్టార్ చిరంజీవి..ప్రస్తుతం కొరటాల డైరెక్షన్లో తన 152 వ చిత్రం ఆచార్య చేస్తున్నాడు. ఈ చిత్రంలో చిరంజీవి డబుల్ రోల్ చేయబోతున్నాడని ప్రచారం జరుగుతుండగా.. సిద్దు.. ఆచార్య అనే రెండు విభిన్నమైన పాత్రల్లో చిరంజీవి కనిపించబోతున్నారని.. అందులో సిద్దు పాత్రలో చరణ్ కనిపించబోతున్నాడని అంటున్నారు.
ఇదిలా ఉంటె తాజాగా ఈ మూవీ లో విలన్ రోల్ కు గాను కలెక్షన్ కింగ్ మోహన్ బాబు ను ఎంపిక చేశారనే వార్తలు బయటకొచ్చాయి. ఈ లోపు మోహన్ బాబు తాజా లుక్ బయటకొచ్చి ఆ వార్తలకు మరింత బలం చేకూరుస్తున్నాయి. చిరు సినిమా కోసమే మోహన్ బాబు కొత్త లుక్తో ఫోటో షూట్లో పాల్గొన్నారనే టాక్స్ వినిపిస్తున్నాయి.
ఈ ఫోటోలలో మోహన్ బాబు.. ప్రభాస్ ‘బుజ్జిగాడు’ చిత్రంలోని లుక్ మాదిరే కనిపిస్తున్నారు. ప్రస్తుతం ఆచార్య షూటింగ్ హైదరాబాద్ కోకాపేట్లోని ఓ భారీ సెట్లో జరుగుతుంది. చిరంజీవిపై యాక్షన్ సీక్వెన్స్ షూట్ జరుగుతుండగా.. త్వరలో మోహన్ బాబు ఈ షూట్లో పాల్గొనబోతున్నట్టు సమాచారం. మణిశర్మ మ్యూజిక్ అందిస్తున్న ఈ మూవీని మ్యాట్నీ మూవీస్ , చరణ్ కలిసి సంయుక్తం గా నిర్మిస్తున్నారు.