పవన్ కళ్యాణ్ మూవీ లో అనసూయ కీలక రోల్..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వరుస పెట్టి సినిమాలు ప్రకటిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే పింక్ రీమేక్ చిత్రాన్ని సెట్స్ పైకి తీసుకెళ్లగా..త్వరలో క్రిష్ డైరెక్షన్లో చేయబోయే 27 వ చిత్రాన్ని సెట్స్ పైకి తీసుకెళ్లబోతున్నాడు. కాగా ఈ మూవీ లో ప్రముఖ యాంకర్ అనసూయ ఓ కీలక పాత్రలో నటించబోతుందని సమాచారం.ఆమెది దాదాపు 30నిమిషాల నిడివి కలిగిన ప్రాధాన్యం ఉన్న రోల్ అని తెలుస్తుంది. ఇదే కనుక నిజం అయితే అనసూయ దశ తిరిగినట్లే అని అంత అంటున్నారు.

గతంలో అత్తారింటికి దారేది సినిమాలో అనసూయ కు ఛాన్స్ వస్తే అప్పుడు వద్దు అనుకోని పెద్ద తప్పు చేసింది. ఆ తర్వాత తన తప్పు తెలుసుకొని భాధ పడింది. అందుకే మరోసారి ఆ తప్పు చేయకూడదని అనసూయ ఫిక్స్ అయినట్లు సమాచారం. ప్రముఖ నిర్మాత ఏఎమ్‌ రత్నం నిర్మిస్తున్న ఈ సినిమాకు ఎమ్‌ఎమ్‌ కీరవాణి మ్యూజిక్ అందిస్తున్నారు. ఈ మూవీ మొఘల్‌ సామ్రాజ్యం నేపథ్యంలో పిరియాడికల్‌ డ్రామాగా తెరకెక్కుతున్నట్లు సమాచారం. జ్ఞాన శేఖర్ ఫోటోగ్రఫీ అందిస్తున్నారు.