భాగ్యనగరంలో పవన్ ‘సరదా’

Pawan Kalyan-Trivikramపొల్లాచ్చిలో పవన్ సందడి ముగిసింది. ఇప్పుడు పవన్ ‘సరదా’ భాగ్యనగరంలో మొదలవనుంది. పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్లో రూపొందుతున్న క్రేజీ ప్రాజెక్ట్ మొదటి షెడ్యూల్ షూటింగ్ పొల్లాచ్చిలో జరిగిన సంగతి తెలిసిందే. మొదటి షెడ్యూల్ లో ఓ పాట తో పాటు భారీ చేజింగ్ సన్నివేశాన్ని తెరకెక్కించాడు దర్శకుడు త్రివిక్రమ్. తాజా సమాచారం ప్రకారం పొల్లాచ్చి లో మొదటి షెడ్యూల్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం రెండవ షెడ్యూల్ ఈ రోజు నుండి హైదరాబాద్ లో ప్రారంభం కానుంది. పవన్ కళ్యాణ్ సరసన సమంత, ప్రణీత హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రాన్ని బివిఎస్ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్నారు. జల్సాకు అదిరిపోయే ఆడియో ఇచ్చిన యువ సంగీత కెరటం దేవిశ్రీ ఈ చిత్రానికి మ్యూజిక్ సమకూరుస్తున్నారు.ఇక ఈ చిత్రం పవన్ మేనరిజంకు తగ్గ కామెడీ, పంచ్ డైలాగులతో పూర్తి స్తాయి కమర్షియల్ వినోదాత్మక చిత్రంగా రూపొందుతోందని యూనిట్ సభ్యల సమాచారం. గతంలో పవన్ – త్రివిక్రమ్ జల్సా తో చేసిన హంగామా తెలిసిందే. ఇప్పుడు అదే కాంబినేషన్ రీపిట్ అవ్వడంతో అభిమానుల్లో ఈ ప్రాజెక్ట్ పై విపరీతమైన అంచనాలు వున్నాయి.