‘మీకు మాత్రమే చెప్తా’ సెన్సార్ రివ్యూ ..

క్రేజీ స్టార్ గా అతి తక్కువ టైంలోనే గుర్తింపు తెచ్చుకున్న విజయ్ దేవరకొండ..తాజాగా నిర్మాత గా మరి మీకు మాత్రమే చెప్తా అనే సినిమా నిర్మించాడు. ఈ చిత్రం లో తరుణ్ భాస్కర్ హీరోగా నటిస్తుండగా ..షమీర్ అనే కొత్త దర్శకుడు పరిచయమవుతున్నారు. అవంతికా మిశ్రా హీరోయిన్ కాగా అభినవ్ గోమటం, నవీన్ జార్జ్ థామస్, అనసూయ, వాణి భోజన్, పావని గంగిరెడ్డి కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

నవంబర్ 01 న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న తరుణంలో చిత్ర సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుంది. సినిమాను చూసిన అధికారులు ఎలాంటి కట్స్ చెప్పకుండా యు/ఎ సర్టిఫికెట్ జారీ చేశారు. సెన్సార్ సభ్యులు చిత్ర టీంను అభినందించారని తెలుస్తుంది. న్యూ ఏజ్ ఫన్ ఎంటర్‌టైనర్‌గా రూపోందిన ఈ సినిమా అందర్నీ ఆకట్టుకుంటుందని అన్నట్లు చిత్ర యూనిట్ తెలిపారు.