మెగాస్టార్ చిరంజీవి సైరా చిత్రం తో ప్రేక్షకుల ముందుకు వచ్చి బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. పాన్ ఇండియా మూవీ గా రిలీజ్ అయినా ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర అదిరిపోయే కలెక్షన్లు రాబడుతూ పలు రికార్డ్స్ సృష్టిస్తుంది. ప్రస్తుతం చిరంజీవి కొరటాల శివ డైరెక్షన్లో తన 152 వ సినిమా చేసేందుకు సిద్దమవుతున్నాడు.
ఈ చిత్రాన్ని నవంబర్ మొదటి వారంలో సెట్స్ పైకి తీసుకెళ్ళబోతున్నారు. రామోజీ ఫిలిం సిటీలో చిత్రం కోసం ప్రత్యేక సెట్ కూడా రూపొందించినట్టు సమాచారం. తొలి షెడ్యూల్ మొత్తాన్ని ఈ సెట్లోనే చిత్రీకరించనున్నట్టు తెలుస్తుంది. ఈ మూవీ లో చిరు కు జోడిగా త్రిష ను ఎంపిక చేశారనే వార్తలు వినిపిస్తున్నాయి. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.