గీతా ఆర్ట్స్ లో ఆఫీస్ లో సైరా సంబరాలు..

మెగాస్టార్ చిరంజీవి నటించిన సైరా చిత్రం బాక్స్ ఆఫీస్ ను షేక్ చేస్తుంది. పాన్ ఇండియన్ మూవీ గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీ అన్ని భాషల్లో సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకొని సరికొత్త రికార్డ్స్ సృష్టిస్తుంది. 12 ఏళ్ల కల తీరడం తో చిరంజీవి ఆనందం మాములుగా లేదు.

ఇప్పటికే మీడియా సమావేశం ఏర్పటు చేసి తన ఆనందాన్ని పంచుకున్న చిరు..తాజాగా గీత ఆర్ట్స్ ఆఫీస్ లో మెగా సంబరాలు జరుపుకున్నారు. యూనిట్ తో పాటుగా మెగాకుటుంబం అంతాసంబరాల్లో పాలుపంచుకుంది. మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్ తో పాటు అల్లు అరవింద్, అల్లు అర్జున్, శిరీష్, వరుణ్ తేజ్, సాయి ధరమ్ తేజ్, నిహారిక, సుకుమార్, త్రివిక్రమ్ శ్రీనివాస్, శ్రీకాంత్ తదితరులు హాజరయ్యారు. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితం ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమాను దాదాపు రూ. 270 కోట్ల రూపాయల ఖర్చు తెరక్కించారు