ఉయ్యాలా వాడ నరసింహారెడ్డి జీవిత నేపథ్యంలో తెరకెక్కిన సైరా నరసింహారెడ్డి చిత్రం నిన్న ( అక్టోబర్ 2న) న పాన్ ఇండియన్ మూవీ గా విడుదలైన సంగతి తెలిసిందే. మొదటి షో తోనే పాజిటివ్ టాక్ రావడంతో బాక్సాఫీస్ వద్ద కలెక్షన్స్ వర్షం కురుస్తుంది. మెగా అభిమానులే కాదు సెలబ్రిటీలు కూడా ఆకాశానికి ఎత్తుతున్నారు. ఇప్పటికే మహేష్, నాని, సుధీర్ బాబు, రాజమౌళి వంటి స్టార్ సెలబ్రిటీలు సినిమాపై ప్రశంసలు కురిపించగా, తాజాగా దర్శకేంద్రుడు కె రాఘవేంద్రరావు తన ట్విట్టర్ ద్వారా తన స్పందనను తెలియజేసాడు.
దశాబ్ధాల నుండి చిరంజీవిని దగ్గరగా చూశాను. పని పట్ల ఆయనకున్న అంకితభావం, ఉత్సాహం ఇంకా తగ్గలేదని చూసి నేను ఆశ్చర్యపోతున్నాను. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి పాత్రలో చిరు ప్రేక్షకుల మనసులు గెలుచుకున్నాడు. ప్రతి అంశంలోను చక్కని నటన కనబరాడు. ఈ వయస్సులో ఇది ఆయన సాధించిన ఘనత అని చెప్పవచ్చు. దర్శకుడు సురేందర్ రెడ్డి దర్శకత్వ ప్రతిభ బాగుంది. ఈ సినిమా కోసం సురేందర్ పెట్టి అపారమైన కృషిని నేను చూశాను. ఇక ప్రీ క్లైమాక్స్ డ్యాన్స్ సీక్వెన్స్లో తమన్నా పర్ఫార్మెన్స్ బాగుంది. ఇంత పెద్ద విజయం సాధించినందుకు చిత్ర బృందానికి నా శుభాకాంక్షలు.కొడుకు నుండి తండ్రి అందుకున్న సరైన బహుమతి ఇది అని రాఘవేంద్రరావు తన ట్వీట్లో పేర్కొన్నారు .
Knowing Chiranjeevi from so many decades, I am amazed by how his dedication and excitement towards his work hasn't diminished. He was mind-blowing as Uyyalawada Narasimha Reddy and excelled in every aspect. It surely is a feat at his age! #SyeraaNarashimaReddy
— Raghavendra Rao K (@Ragavendraraoba) 3 October 2019
. @DirSurender, your direction is just terrific and I can see the immense effort you have put in creating this film. A special mention to @tamannaahspeaks for her performance, especially in the pre-climax dance sequence. #SyeraNarasimhaReddy
— Raghavendra Rao K (@Ragavendraraoba) 3 October 2019
Congratulations to the entire team of #SyeRaaNarasimhaReddy for scoring a blockbuster! This is a perfect gift to a father from a son… #RamCharan @KonidelaPro
— Raghavendra Rao K (@Ragavendraraoba) 3 October 2019