ముద్దుతో బిందెను గిఫ్ట్‌గా ఇచ్చింది

వరుణ్‌, పూజా హెగ్డే నటించిన ‘వాల్మీకి’ చిత్రం ప్రేక్షకుల ముందుకు రావడానికి సమయం దగ్గరపడుతోంది. దాంతో చిత్ర యూనిట్‌ చురుగ్గా ప్రమోషన్‌ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ఈ చిత్రంలో శోభన్‌బాబు, శ్రీదేవిల వెల్లువచ్చి గోదారమ్మా… పాటను రీమిక్స్‌ చేశారు. తాజాగా ఈ పాటను దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు చేతుల మీదుగా విడుదల చేశారు. ఈ పాటకు ప్రేక్షకుల నుండి మంచి స్పందన వస్తోంది. ఈ సందర్భంగా పూజా మాట్లాడుతూ రాఘవేంద్రరావు గురించి మాట్లాడుతూ వేదికపై ఆయన కాళ్లకు నమస్కరించి ఆశీర్వాదం తీసుకుంది. ఈ చిత్రంలో పూజా శ్రీదేవి, వరుణ్‌ గణేష్‌లుగా కనిపించనున్నారు.

శ్రీదేవి మ్యామ్‌ నాకు స్పూర్తి, మొదట్లో ఈ పాటకు డ్యాన్స్‌ చేయగలనా? అని టెన్షన్‌ పడ్డాను. కానీ శ్రీదేవి మ్యామ్‌ని స్పూర్తిగా తీసుకుని చేశాను అని చక్కగా మాట్లాడింది. ఇక అక్కడ ఉన్న ఒక బిందెను తీసుకుని దానికి ముద్దుపెట్టి దర్శకేంద్రుడిగా గిఫ్ట్‌ ఇచ్చింది. రాఘవేంద్రరావు కూడా సంతోషంగా ఆ బిందెను స్వీకరించారు. ముద్దుతో బిందెను కానుక ఇవ్వడంతో అమ్మడి అభిమానులు పూజాని తెగ పొగిడేస్తున్నారు. అంతేకాదు తమకు అలాంటి ముద్దు బిందెల కానుకలు కావాలంటున్నారు.