సాహో మొత్తం స్టోరీ బయటకు వచ్చేసింది..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన సాహో చిత్రం మరికొన్ని గంటల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇండియా లో అర్ధరాత్రి నుండి సాహో సందడి మొదలు అవుతుండగా..యూఎస్ లో మాత్రం మరికాసేపట్లో షోస్ పడనున్నాయి. ఈ టైం లో సాహో ఫుల్ స్టోరీ బయటకు వచ్చేయడం అందరికి షాక్ ను కలిగిస్తుంది.

సాహో స్టోరీ లోకి వెళ్తే.. రెండు వేలకోట్ల రూపాయలకు సంబంధించిన కథ ఇది. ఆ డబ్బును కొట్టేసిన గ్యాంగ్ స్టర్స్ ను పట్టుకోవడానికి నియమించబడిన కాప్ ప్రభాస్. ఇది ఇంటర్వెల్ ముందు వరకు చూసే ప్రేక్షకుడికి తెలియదు. ఇంటర్వెల్ ముందు వరకు ప్రభాస్ ఓ దొంగగా కనిపిస్తాడు. గ్యాంగ్ ను పట్టుకోవడం కోసమే ప్రభాస్ అలా దొంగలా కనిపిస్తారట. హాలీవుడ్ బాండ్ సినిమాల్లో ఎలాగైతే మెయిన్ టార్గెట్ రీచ్ కావడానికి ముందు ఎలా కనిపిస్తాడో అలానే సాహో లో ప్రభాస్ కూడా కనిపిస్తారట. దొంగగా ఉన్న సమయంలో ప్రభాస్ ను శ్రద్దా కపూర్ అపార్ధం చేసుకుంటుంది. అసలు విషయం తెలిసిన తరువాత మనసు మార్చుకొని అతడిని ప్రేమించడం మొదలు పెడుతుంది. ఆ తర్వాత ఇద్దరు కలిసి ఆ గ్యాంగ్ ను పట్టుకుంటారట. ఇది సాహో ఫుల్ స్టోరీ అని సోషల్ మీడియా లో వైరల్ గా చక్కర్లు కొడుతుంది. మరి ఈ స్టొరీనేనా కదా అనేది కాసేపట్లో తెలుస్తుంది.