నాగ్‌తో సినిమా లేదని తేల్చేసిన డైరెక్టర్‌

మన్మధుడు 2 చిత్రం తర్వాత నాగార్జున చేయబోతున్న చిత్రం ‘బంగార్రాజు’. కళ్యాణ్‌ కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కబోతున్న బంగార్రాజు త్వరలో షూటింగ్‌ ప్రారంభం కాబోతుంది. ఆ సినిమా షూటింగ్‌ పూర్తి కాకుండానే నాగార్జున మరో సినిమాను కూడా మొదలు పెట్టబోతున్నాడని, ఒక కామెడీ ఎంటర్‌టైనర్‌ స్క్రిప్ట్‌తో దర్శకుడు గోపీచంద్‌ మలినేని నాగార్జునను ఒప్పించాడంటూ వార్తలు వచ్చాయి. గత వారం రోజులుగా సోషల్‌ మీడియాలో వస్తున్న ఈ వార్తలపై సినీ వర్గాల్లో పెద్ద ఎత్తున ఆసక్తి నెలకొంది. ఈ సమయంలోనే ఈ మూవీపై దర్శకుడు క్లారిటీ ఇచ్చాడు.

మీడియాలో వస్తున్న వార్తలు పూర్తిగా అబద్దం. ఇప్పటి వరకు నాగార్జున గారిని నేను కథ చెప్పేందుకు కూడా కలవలేదు. అలాంటిది ఆయనతో సినిమా అంటూ ప్రచారం జరుగుతుంది. ఆ వార్తల్లో ఎలాంటి నిజం లేదు. పూర్తిగా నిరాధారమైన ఆ వార్తలను నమ్మకండి. ప్రస్తుతం తాను ఏ ప్రాజెక్ట్‌ చేయడంలేదని, ఏదైనా మొదలు పెట్టిన వెంటనే చెప్తానంటూ క్లారిటీ ఇచ్చాడు. ఎవరికి ఇష్టం వచ్చినట్లుగా వారు పుకార్లు పుట్టించడంపై ఆయన మండి పడ్డాడు. నాగార్జున బంగార్రాజు చిత్రం తర్వాత చేయబోతున్న సినిమా ఏంటో అనేది చూడాలి.