కూలి నెం 1, నిన్నే పెళ్లాడతా , ఆవిడా మా ఆవిడే వంటి ఫ్యామిలీ చిత్రాలతో తెలుగు ప్రేక్షకులను అలరించిన సీనియర్ నటి టబు..విరాటపర్వం చిత్ర యూనిట్ కు షాక్ ఇచ్చింది. ప్రస్తుతం టబు త్రివిక్రమ్ – అల్లు అర్జున్ కలయికలో తెరకెక్కుతున్న చిత్రంలో కీలక పాత్రలో నటిస్తుంది. దీంతో పాటు రానా , సాయి పల్లవి జంటగా వేణు ఉడుగల దర్శకత్వంలో తెరకెక్కుతున్న విరాట పర్వం చిత్రంలో ఓ పాత్రలో నటించడానికి ఓకే చెప్పింది.
తాజా సమాచారం ప్రకారం ఆమె ఆ ప్రాజెక్ట్ నుండి తప్పుకుందని అంటున్నారు. విరాటపర్వం చిత్ర షూటింగ్ మరింత డిలే అవుతుండడంతో టబు తన డేట్స్ అడ్జెస్ట్ చేయలేకపోతుందట. బాలీవుడ్ చిత్రానికి కూడా టబు కాల్షీట్స్ ఇవ్వడంతో రెండు క్లాష్ అవుతున్నాయని బీటౌన్ టాక్. ఈ నేపథ్యంలోనే టబు విరాటపర్వం నుండి తప్పుకుందని చెబుతున్నారు. ఆమె స్థానంలో నేషనల్ అవార్డ్ విన్నింగ్ యాక్టర్ , బాలీవుడ్ నటి నందిత శ్వేతని ఎంపిక చేసినట్టు సమాచారం. ఈ చిత్రాన్ని సుధాకర్ చెరుకూరి, సురేష్ బాబు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ప్రియమణి, ఈశ్వరీరావు, సాయి చంద్, జరీనా వహబ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు.