ఒకప్పుడు హీరోయిన్ గా.. ఐటెం భామ గా ప్రేక్షకులను అలరించిన చార్మింగ్ గర్ల్ ఛార్మి..ప్రస్తుతం పూరి తో కలిసి ప్రొడక్షన్ హౌస్ మొదలు పెట్టింది. పూరి సినిమాలకు సహా నిర్మాతగా వ్యవహరిస్తూ కాస్టింగ్ & క్రూ చూసుకునే బాధ్యత చేస్తుంది. తాజాగా ఇస్మార్ట్ శంకర్ చిత్రం తో సూపర్ హిట్ అందుకున్న ఛార్మి..ప్రతి రోజు ఈ సినిమాకు సంబందించిన విశేషాలను అభిమానులతో పంచుకుంటుంది.
మంగళవారం ఛార్మి చేసిన ట్వీట్ అందర్నీ షాక్ లో పడేసింది. ‘ఇస్మార్ట్ శంకర్’లోని ‘ఉండిపో’ అనే రొమాంటిక్ సాంగ్ను మాల్దీవులులో చిత్రీకరించారు. ఈ పాటలోని కొన్ని ఎక్స్క్లూజివ్ షాట్స్ను ఒక ఇసుక దీవిలో షూట్ చేశారట. ఈ ఇసుక దీవికి ఒక ప్రత్యేకత ఉంది. ప్రతి రోజూ కొన్ని గంటలపాటు మాత్రమే ఈ ఇసుక దీవి కనిపిస్తుంది. ఆ తరవాత మళ్లీ సముద్రం ముందుకొచ్చి ఈ దీవి మునిగిపోతుంది. ఆ కొన్ని గంటల వ్యవధిలోనే పాటకు సంబంధించిన షాట్స్ను చిత్రీకరించారట. అయితే, షూటింగ్ అయిపోయిన తరవాత యూనిట్ మొత్తం ఫెర్రీ ఎక్కుతున్న వీడియోను ఛార్మి ట్వీట్ చేశారు. సముద్రంలో మునిగిపోతామేమోనని తను చాలా భయమేసిందని ఛార్మి ఈ ట్వీట్లో చెప్పుకొచ్చింది.
The sand bank island in #Maldives is alive only for few hrs every day .. shot few very exclusive shots from #undipo song there for #iSmartShankar ? n this was the tense me ? worried if all of us will sink in the ocean ?????? pic.twitter.com/Av9Wxroh58
— Charmme Kaur (@Charmmeofficial) 6 August 2019