ఛార్మి చాల భయపడ్డ క్షణం అదేనట..

ఒకప్పుడు హీరోయిన్ గా.. ఐటెం భామ గా ప్రేక్షకులను అలరించిన చార్మింగ్ గర్ల్ ఛార్మి..ప్రస్తుతం పూరి తో కలిసి ప్రొడక్షన్ హౌస్ మొదలు పెట్టింది. పూరి సినిమాలకు సహా నిర్మాతగా వ్యవహరిస్తూ కాస్టింగ్ & క్రూ చూసుకునే బాధ్యత చేస్తుంది. తాజాగా ఇస్మార్ట్ శంకర్ చిత్రం తో సూపర్ హిట్ అందుకున్న ఛార్మి..ప్రతి రోజు ఈ సినిమాకు సంబందించిన విశేషాలను అభిమానులతో పంచుకుంటుంది.

మంగళవారం ఛార్మి చేసిన ట్వీట్ అందర్నీ షాక్ లో పడేసింది. ‘ఇస్మార్ట్ శంకర్’లోని ‘ఉండిపో’ అనే రొమాంటిక్ సాంగ్‌ను మాల్దీవులులో చిత్రీకరించారు. ఈ పాటలోని కొన్ని ఎక్స్‌క్లూజివ్ షాట్స్‌ను ఒక ఇసుక దీవిలో షూట్ చేశారట. ఈ ఇసుక దీవికి ఒక ప్రత్యేకత ఉంది. ప్రతి రోజూ కొన్ని గంటలపాటు మాత్రమే ఈ ఇసుక దీవి కనిపిస్తుంది. ఆ తరవాత మళ్లీ సముద్రం ముందుకొచ్చి ఈ దీవి మునిగిపోతుంది. ఆ కొన్ని గంటల వ్యవధిలోనే పాటకు సంబంధించిన షాట్స్‌ను చిత్రీకరించారట. అయితే, షూటింగ్ అయిపోయిన తరవాత యూనిట్ మొత్తం ఫెర్రీ ఎక్కుతున్న వీడియోను ఛార్మి ట్వీట్ చేశారు. సముద్రంలో మునిగిపోతామేమోనని తను చాలా భయమేసిందని ఛార్మి ఈ ట్వీట్‌లో చెప్పుకొచ్చింది.