ఫిదా చిత్రంలో తెలంగాణా యాసతో అందర్నీ ఫిదా చేసిన సాయి పల్లవి..మరోసారి అదే యాస తో అందర్నీ మెప్పించబోతుంది. శేఖర్ కమ్ముల డైరెక్షన్లో ఫిదా చిత్రంలో నటించిన సాయి పల్లవి..మొదటి చిత్రంతోనే అందర్నీ ఆకట్టుకుంది. ముఖ్యంగా తెలంగాణ ప్రజలంతా అమ్మడికి వీరాభిమానులు అయ్యారు. అచ్చం తెలంగాణ అమ్మాయిల కనిపించి..తన వాయిస్ తో ఆకట్టుకుంది. ఈ సినిమా తర్వాత నాని సరసన ఏంసిఏ చిత్రంలో నటించింది. ఇందులో కూడా వరంగల్ అమ్మాయి గా కనిపించింది.
ఇప్పుడు మూడో సారి తెలంగాణ అమ్మాయిగా కనిపించబోతుంది. రానాతో కలిసి విరాటపర్వం అనే సినిమాలో సాయి పల్లవి నటిస్తుంది. వేణు ఉడుగుల డైరెక్షన్లో ఈ మూవీ తెరకెక్కుతుంది. ప్రస్తుతం షూటింగ్ కాస్త బ్రేక్ పడింది. అక్టోబర్ నుంచి షూటింగ్ ప్రారంభం కాబోతున్నది. నక్సలిజం స్టోరీతో తెరకెక్కుతున్న ఈ మూవీలో సాయి పల్లవి జానపద కళాకారునిగా కనిపిస్తుందట. వైజాగ్కి చెందిన అలనాటి బాలీవుడ్ నటి జరీనా వాహబ్ కూడా చిత్రంలో ముఖ్య పాత్ర పోషించనున్నట్టు తెలుస్తుంది. బాలీవుడ్ నటుడు నానా పటేకర్ చిత్రంలో ప్రతినాయకుడి పాత్రలో కనిపించనున్నాడట. అలానే టబు పాత్ర కూడా కాస్త నెగెటివ్ షేడ్ లో ఉంటుందని అంటున్నారు. ఎస్ ఎల్ వి సినిమాస్, సురేష్ ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.