మరోవారం ఇస్మార్ట్‌ కుమ్ముడే

రామ్‌ హీరోగా నభా నటేష్‌, నిధి అగర్వాల్‌ హీరోయిన్స్‌గా తెరకెక్కిన ‘ఇస్మార్ట్‌ శంకర్‌’ చిత్రం ఇటీవలే విడుదలై మంచి వసూళ్లను నమోదు చేస్తోంది. రెండు వారాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం దాదాపుగా 70 కోట్ల వసూళ్లను రాబట్టింది. డియర్‌ కామ్రేడ్‌ చిత్రంను కాదని కూడా ప్రేక్షకులు ఈ చిత్రాన్ని చూస్తున్నారు. దాంతో డియర్‌ కామ్రేడ్‌ కంటే కూడా ఈ చిత్రంకే అధికంగా కలెక్షన్స్‌ నమోదు అవుతున్నాయి. పూరి దర్శకత్వంలో రూపొందిన ఈ మాస్‌ మాసాలా చిత్రాన్ని నైజాం ఫ్యాన్స్‌ ఓన్‌ చేసుకున్నారు.

ఇక రేపు శుక్రవారం అవ్వడంతో పలు చిత్రాలు విడుదల కాబోతున్నాయి. అందులో ముఖ్యంగా రాక్షసుడు మరియు గుణ. ఈ రెండు సినిమాలపై కూడా ప్రేక్షకుల్లో ఆసక్తి లేదు. ఒక వేళ రెండు సినిమాల్లో ఏదైనా ఒకటి లేదా రెండు మంచి టాక్‌ దక్కించుకుని సూపర్‌ హిట్‌ అయితే తప్ప ఇస్మార్ట్‌ శంకర్‌ కలెక్షన్స్‌ తగ్గవని అంటున్నారు. వచ్చే వారంకు మన్మధుడు 2 రాబోతున్నాడు కనుక అప్పటి వరకు ఈ జోరు ఇలాగే కొనసాగే అవకాశం ఉందని సినీ వర్గాల వారు అంటున్నారు.