హీరో రూ. 18 వేల చలానాలు పెడ్డింగ్‌

యాంగ్రీ యంగ్‌ మన్‌ రాజశేఖర్‌కు హైదరాబాద్‌ ట్రాఫిక్‌ పోలీసులు షాక్‌ ఇచ్చారు. ఆయన ఉపయోగిస్తున్న కార్లపై ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 18 వేల రూపాయల చలానాలు పెడ్డింగ్‌లో ఉన్నాయి. ఆ విషయాన్ని పోలీసులు అధికారికంగా బయటకు వెళ్లడించడంతో రాజశేఖర్‌ పరువు పోయింది. సోషల్‌ మీడియాలో ఆయనపై ట్రోల్స్‌ వస్తున్నాయి. హీరోగా నలుగురికి ఆదర్శంగా ఉండాల్సిన మీరు ఇలా చేయడం ఏంటీ అంటూ ఆయన్ను తీవ్రంగా విమర్శించారు.

దాంతో రాజశేఖర్‌ వెంటనే ఆ మొత్తం చలానాను వెంటనే క్లీయర్‌ చేశాడు. తాను మొత్తం చలానాను క్లీయర్‌ చేశారు. కొన్ని కారణాల వల్ల ఆ చలానాలు ఇన్ని రోజులు పే చేయకుండా ఉన్నాను. పోలీసులు ఇప్పుడు నన్ను ఇబ్బంది పెట్టడం వల్ల నేను చలానా కట్టడం జరిగిందని అంటున్నారు. అలా ఏం లేదు కాని దేనికైనా సమయం రావాలి కదా అందుకే ఇప్పుడు కట్టాను అంటూ రాజశేఖర్‌ సన్నిహితుల వద్ద అంటున్నారు. మొత్తానికి బాగానే కవర్‌ చేసుకుంటున్న రాజశేఖర్‌ ఇప్పటికే తన పరువును పోగొట్టుకున్నాడు.