వారి వల్ల నేను చాలా బాధ పడ్డాను : పూరి

చాలా కాలం తర్వాత ఇస్మార్ట్‌ శంకర్‌ చిత్రంతో తనదైన శైలి సక్సెస్‌ను పూరి దక్కించుకున్నాడు. రామ్‌ హీరోగా రూపొందిన ఈ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద మంచి వసూళ్లను నమోదు చేస్తుంది. ఇప్పటి వరకు ఈ చిత్రం దాదాపుగా 67 కోట్ల గ్రాస్‌ను వసూళ్లు చేసినట్లుగా సమాచారం అందుతోది. లాంగ్‌ రన్‌లో ఈ చిత్రం 75 కోట్ల వరకు రాబట్టే అవకాశం ఉంది. ఇలాంటి నేపథ్యంలో పూరి జగన్నాధ్‌ ఒక మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలను వెళ్లడించాడు.

సినిమా పూర్తి అయిన తర్వాత దర్శకుడిగా ఎలాంటి ఇబ్బంది పడలేదు. కాని నిర్మాతగా మాత్రం నన్ను కొందరు ఒక ఆట ఆడుకున్నారు. వారు నన్ను ఎంతగా టార్చర్‌ పెట్టారో త్వరలో చెబుతాను. నిర్మాతలకు సినిమా విడుదల సమయంలో కొందరు చుక్కలు చూపుతూ ఉంటారు. ముఖ్యంగా చిన్న చిత్రాలకు ఫ్లాప్‌లో ఉన్న డైరెక్టర్‌ చిత్రానికి ఇబ్బందులు తలెత్తుతూ ఉంటాయి. బయర్లు సినిమాను మరీ దారుణంగా తక్కువ రేటుకు కొనుగోలు చేసేందుకు మూకుమ్మడిగా ప్లాన్‌ చేస్తారు. అలాంటివి నాతో చాలానే జరిగాయని పూరి చెప్పుకొచ్చాడు.