నాగ్‌తో అనసూయ ఢీ కొట్టబోతుందా?

ఈమద్య కాలంలో అనసూయ బుల్లి తెరపై మాత్రమే కాకుండా వెండి తెరపై కూడా తెగ సక్సెస్‌లను దక్కించుకుంటుంది. రంగస్థలం చిత్రంలోని రంగమ్మత్త పాత్ర తర్వాత ఈమె క్రేజ్‌ అమాంతం పెరిగింది. ఈ అమ్మడు వరుసగా చిత్రాలు చేస్త వస్తోంది. తాజాగా ఈమె కథనం చిత్రంను పూర్తి చేసింది. ఇటీవలే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ చిత్రాన్ని ఆగస్టు నెలలో విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లుగా సమాచారం అందుతోంది. ఆగస్టు 15న విడుదల చేయాలనుకుంటే అదే రోజు రెండు మూడు సినిమాలు విడుదల కాబోతున్నాయి. అందుకే అంతకు ముందే విడుదల చేయాలని నిర్ణయించుకున్నారు.

‘కథనం’ చిత్రంను ఆగస్టు 8 లేదా 9వ తారీకున విడుదల చేసే అవకాశం కనిపిస్తుంది. ఆగస్టు 9వ తారీకున నాగార్జున ‘మన్మధుడు 2’ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఆ చిత్రంపై అంచనాలు భారీగా ఉన్నాయి. అయినా కూడా కథనం చిత్రంను ఆ చిత్రానికి పోటీగా విడుదల చేయాలని నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తోంది. కథనం చిత్రంపై యూనిట్‌ సభ్యులకు చాలా నమ్మకం ఉన్నట్లుగా అనిపిస్తుంది. కథనం చిత్రం సక్సెస్‌ అయితే మన్మధుడు 2 కి గట్టి పోటీ ఇచ్చే అవకాశం ఉందని యూనిట్‌ సభ్యులు భావిస్తున్నారు. అందుకే ఎలాంటి భయం లేకుండా కథనంను ఆగస్టు 8 లేదా 9వ తారీకున విడుదల చేయాలని ప్రయత్నాలు చేస్తున్నారు.