వర్మకు ఛార్మి బంపరాఫర్

 

టాలీవుడ్ లో ఒకప్పుడు స్టార్ హీరోయన్ గా ఓ వెలుగు వెలిగిన నటీమణి ఛార్మి. ఈ హీరోయిన్ ప్రస్తుతం పూర్తిస్థాయి నిర్మాతగా మారిపోయారు. ఇంతకాలం పూరి సినిమా వ్యవహారాలను మాత్రమే చూసుకున్న ఆమె ఇప్పుడు ఆయనతో కలిసి ‘ఇస్మార్ట్ శంకర్’ సినిమాను నిర్మించారు. సినిమాకు సూపర్ హైప్ క్రియేట్ కావడంతో ఆనందంలో ఉన్న ఆమె పూరి గురువుగారు రామ్ గోపాల్ వర్మకు మంచి ఆఫర్ ఇచ్చేసింది.

అదేమంటే.. ‘ఇస్మార్ట్ శంకర్’ సినిమాను వర్మ తన ట్విట్టర్ వేదికగా ప్రశంసలు కురిపిస్తూ.. పూరి ఈసారి హిట్ అందుకోవడం ఖాయమని జోస్యం చెప్పారు. కాగా ఛార్మి ఈ ఆనందంతో వర్మను ఉద్దేశించి ట్వీట్ చేస్తూ.. మీరు త్వరగా హైదరాబాద్ వచ్చేస్తే మీకిష్టమైన వోడ్కాలో మిమ్మల్ని ముంచేస్తాం సార్ అంటూ తెలిపింది. మొత్తానికి వర్మ ఈ ఆఫర్ ను ఎలా స్వీకరిస్తారో చూడాలి.