పోలవరం అవకతవకలపై కేంద్రం కీలక ప్రకటన…!

పోలవరం నిర్మాణంలో అవకతవల విషయమై కేంద్రం కీలక ప్రకటన చేసింది. విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నకు కేంద్రం సమాధానం ఇచ్చింది. ప్రాజెక్టు నిర్మాణంలో ఎలాంటి అవకతవకలు చోటు చేసుకోలేదని తెలిపింది.పోలవరం నిర్మాణంలో అవకతవలకు సంబంధించి సోమవారం రాజ్యసభలో ప్రశ్నల పరంపర కొనసాగింది. వైఎస్ఆర్సీపీ ఎంపీలు, బీజేపీ సభ్యులు జీవీఎల్‌తో పాటు పలువురు సభ్యులు.. పోలవరంపై వస్తున్న అవినీతి ఆరోపణలపై విచారణ జరిపించాలని కేంద్రంపై ఒత్తిడి తెచ్చారు.

 

పోలవరం నిర్వాసితులకు పునరావాసం, పునర్నిర్మాణంలో అవకతవకలు జరిగాయంటూ వైఎస్ఆర్సీపీ ఎంపీ విజయసాయి రెడ్డి రాజ్యసభలో ప్రస్తావించారు. విజయసాయి ప్రశ్నలకు కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ బదులిచ్చారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో అవకతవకలు జరిగినట్టు తమకు ఎలాంటి నివేదికలు రాలేదని, సీబీఐ విచారణకు ఆదేశించే అవకాశం కూడా లేదని ఆయన స్పష్టం చేశారు.