విజయ్ దేవరకొండ, రష్మిక మందన హీరోహేరోయిన్స్ గా నటించిన చిత్రం డియర్ కామ్రేడ్. భరత్ కమ్మ దర్శకత్వం వహించిన ఈ సినిమాని మైత్రీ మూవీ మేకర్స్, బిగ్ బెన్ సినిమాస్ బ్యానర్స్ మీద నవీన్ ఎర్నేని, యలమంచిలి రవిశంకర్, మోహన్ చెరుకూరి(సి.వి.ఎం), యష్ రంగినేని సంయుక్తగా నిర్మించారు.
ఈనెల 26న ప్రేక్షకుల ముందుకు వస్తోన్న ఈ సినిమాకి ప్రమోషన్స్ లో భాగంగా ఈరోజు (జులై 11న) చిత్ర థియేట్రికల్ ట్రైలర్ను విడుదల చేశారు. ఈ మేరకు హైదరాబాద్లో ట్రైలర్ లాంచ్ వేడుకను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విజయ్ దేవరకొండ, రష్మిక మందన, దర్శకుడు భరత్ కమ్మ, నిర్మాతలు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా విజయ్ దేవరకొండ మాట్లాడుతూ ట్రైలర్ అందరికి నచ్చిందనుకుంటున్నానని, ఈ సినిమా మ్యూజికల్ ఫెస్ట్ నిర్వహించబోతున్నామని ఈ నెల 12న బెంగుళూరులో, 13న కొచ్చిలో, 18న చెన్నైలో, 19న హైదరాబాద్లో మ్యూజికల్ ఫెస్టివల్ నిర్వహించనున్నామని చెప్పుకొచ్చాడు. ఇక రష్మిక మందన్నా మాట్లాడుతూ ఈ సినిమాలో లిల్లీ పాత్రలో కనిపిస్తానని పది నిమిషాల సన్నివేశాల కోసం మూడు, నాలుగు నెలలు క్రికెట్ నేర్చుకోవాల్సి వచ్చింది. అలాగే సెట్లో నన్ను 20 రోజులపాటు ఏడిపించారని చెప్పుకొచ్చింది.