చిరంజీవిని కూడా వదలని ప్రభాస్ !

టాలీవుడ్ లో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న చిత్రాలలో ఒకటి సైరా నరసింహారెడ్డి. మెగాస్టార్ చిరంజీవి డ్రీమ్‌ ప్రాజెక్ట్ కావటంతో మెగా తనయుడు రామ్‌ చరణ్‌ ఈ సినిమాను ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నాడు. సురేందర్‌ రెడ్డి దర్శకత్వంతో తెరకెక్కుతున్న ఈ సినిమా అక్టోబర్‌ 2న ప్రేక్షకుల ముందుకు వస్తున్నట్టు అనధికారికంగా ఖరారు చేసేశారు.

ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతున్న సైరా నరసింహా రెడ్డి చిత్రంలో చిరంజీవి సరసన నయనతార నటిస్తుండగా.. తమన్నా కీలక పాత్ర పోషిస్తోంది. అమితాబ్ బచ్చన్, కుచ్చ సుదీప్, విజయ్ సేతుపతి, జగపతి బాబు లాంటి భారీ స్టార్ క్యాస్టింగ్ ఉన్నారు. దీంతో ఇప్పటికే సైరా నరసింహారెడ్డి ప్రీ రిలీజ్ బిజినెస్‌ ప్రారంభమైనట్టుగా తెలుస్తోంది.

ఖైదీ నంబర్ 150 ఘనవిజయం సాధించటం, భారీ బడ్జెట్‌ తో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన ఈసినిమా కావటంతో సైరాకు అదే స్థాయిలో డిమాండ్‌ ఏర్పడినట్టు చెబుతున్నారు. దీంతో హెవీ పోటీ ఉన్నా మంచి ఫ్యాన్సీ రేట్ పెట్టి మరీ సాహో సినిమాని నిర్మిస్తున్న నిర్మాణ సంస్థ యూవీ క్రియేషన్స్ సైరా ఏపీ డిస్ట్రిబ్యూషన్‌ హక్కులను సొంతం చేసుకున్నట్టుగా ప్రచారం జరుగుతోంది.

నిజానికి పేరుకి ఇది ప్రభాస్ స్నేహితుల సంస్థే కానీ ఫైనాన్సింగ్ అంతా ప్రభాసే చూసుకుంటాడు. ఇక ఈ సినిమా కొనే ఆలోచన కూడా ప్రభాస్ దేనని, చిరంజీవి సినిమా అంటే భారీ క్రేజ్ ఉంటుందని, ఆ క్రేజ్ ని క్యాష్ చేసుకోవాలని ప్రభాస్ అలా ప్లాన్ చేశాడని అంటున్నారు. అలా చిరంజీవిని చిరంజీవి క్రేజ్ ని కూడా ప్రభాస్ వదలడం లేదని అనుకుంటున్నారు సినీ జనాలు. చూడాలి మరి ఈ సినిమా మనోడికి ఎన్ని కలెక్షన్లు తెచ్చిపెడుతుందో ?