ఏపీలో టీడీపీకి షాకిచ్చిన ఎమ్మెల్సీ…!

అధికారం కోల్పోయిన దగ్గర నుంచి టీడీపీకి వరుస దెబ్బలు తగులుతూనే ఉన్నాయి. టీడీపీలో కీలక నేతగా ఉన్న ఎమ్మెల్సీ అన్నం సతీష్ ప్రభాకర్ టీడీపీకి గుడ్‌ బై చెప్పే యోచనలో ఉన్నట్లు తెలుస్తుంది. గుంటూరు జిల్లా బాపట్లకి చెందిన సతీష్ టీడీపీలో కీలక నేతగా ఉన్నారు. ఎమ్మెల్సీ గా ఉంటూనే గత ఎన్నికల్లో బాపట్ల నుంచి పోటీకి దిగిన ప్రభాకర్ ప్రస్తుత ఏపీ డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి చేతిలో ఓటమి పాలయ్యారు.

 

టీడీపీలో యాక్టివ్ గా పని చేసి అధినేత వద్ద మంచి గుర్తింపు పొందడంతో అధినేత చంద్రబాబు ఎమ్మెల్సీగా నామినేట్ చేసి మండలికి పంపారు. అయితే ఆయన ఇప్పుడు టీడీపీకి, ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయడం జిల్లాలో చర్చనీయాంశమైంది. ప్రభాకర్ బీజేపీ నేతలతో టచ్ లో ఉన్నట్లు తెలుస్తుంది. ఏపీ బీజేపీ చీఫ్ కన్నా లక్ష్మీనారయణ సొంత జిల్లా గుంటూరుకు చెందిన నేత కావడంతో సతీష్ తో ఆయనే సంప్రదింపులు జరిపినట్లు తెలుస్తుంది.