చిరంజీవితో పోటీకి సై అంటుందా ?

భాగమతి సినిమా తరువాత చాల గ్యాప్ తీసుకున్న అనుష్క ఈ మధ్యనే ఒక సినిమా ఒప్పుకున్న సంగతి తెలిసిందే. లేడీ ఒరిఎంటెడ్ సబ్జెక్ట్ అయిన సైలెన్స్ అనే సినిమా చేయడానికి అనుష్క అంగీకరించింది. హేమంత్ మధుకర్ దర్శకత్వం వహించనున్న ఈ సినిమా, తెలుగుతో పాటు తమిళ హిందీ భాషల్లో ఏకకాలంలో రూపొందుతోంది. ఈ సినిమాకి కోన వెంకట్ కధ అందించడంతో పటు సహా నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు. అయితే కథ అంత అమెరికాలో జరగడం వలన ఈ సినిమా షూటింగ్ సింహ భాగం అమెరికాలో జరుగుతోంది.

ఈ సస్పెన్స్ థ్రిల్లర్ లో హాలీవుడ్ నటుడు మైఖేల్ మ్యాడ్సన్ తో పాటు తమిళ హీరో మాధవన్, హీరోయిన్లు అంజలి, షాలినీ పాండేలు కూడా నటింస్తున్నారు. ఇప్పటికే 50 శాతం షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమాని దసరాకి విడుదల చేయాలనే ఆలోచనలో వున్నారట మేకర్స్. తెలుగులో ‘నిశ్శబ్దం’ టైటిల్ తోను, తమిళ హిందీ భాషల్లో ‘సైలెన్స్’ టైటిల్ తోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే అనుష్క ఈ సినిమాతో పాటు సైరాలో కూడా ఒక రోల్ లో నటిస్తున్నారు. సైరా దసరాకి డేట్ ఫిక్స్ చేసుకున్న నేపధ్యంలో ఇప్పుడు అనుష్క ఆ సినిమా పోటీగా వెళ్ళడం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.