ఏపీ ఆర్ధిక పరిస్థితి పై శ్వేతపత్రం

అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల వేళ రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి పై శ్వేతపత్రం విడుదల చేయనుంది ఏపీ ప్రభుత్వం. గత టీడీపీ ప్రభుత్వంలో జరిగిన కేటాయింపులు రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి పై సవివరంగా నివేదిక రూపోందించింది జగన్ సర్కార్. లోటు బడ్జెట్ తో ఉన్న ఏపీ ప్రభుత్వం సంక్షేమ పథకాల కేటయింపులు ఎలా చేస్తుందన్నది ఈ నివేదిక ద్వారా అర్ధమయ్యే అవకాశం ఉంది.

టీడీపీ హాయంలో ఉన్న పెండింగ్ బకాయిలు, బడ్జెట్ లో కేటాయించిన నిధులు ఏ విధంగా పక్కదారి పట్టించింది ఈ నివేదికలో పొందు పరిచామన్నారు ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి. ఈ నివేదిక ద్వారా టీడీపీ ప్రభుత్వం ఇచ్చిన హామీలు,రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి ఏ విదంగా ఉందో తెలియజేయనున్నారు మంత్రి బుగ్గన.