ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావించి నిర్మిస్తోన్న పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్టుపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. ఈ పోలవరం ప్రాజెక్టుపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఒడిశా సర్కార్ దాఖలు చేసిన ఒరిజినల్ సూట్పై ఈరోజు సుప్రీంకోర్ట్ విచారణ చేపట్టింది. ఈ ప్రాజెక్టుకు సరైన అనుమతులు లేవని, స్టాఫ్వర్క్ ఆర్డర్ను పదేపదే నిలుపుదల చేస్తున్నారంటూ తన పిటిషన్లో ఒడిశా ప్రభుత్వం పేర్కొంది. దీనిపై వాదనలు వినిపించడానికి 6 వారాలపాటు గడువు కావాలని సుప్రీంకోర్టును కోరారు ఏపీ తరపు న్యాయవాది జీఎస్ రెడ్డి.
అదేవిధంగా పోలవరంపై ఉన్న అనుబంధ అప్లికేషన్కు నాలుగు వారాల గడువు ఉన్నందున ఇందుకు సంబంధించి మాత్రమే సమయం ఇస్తామని సుప్రీంకోర్టు తెలిపింది సుప్రీంకోర్టు. దీంతో ఈ కేసుకు చెందిన తర్వాతి విచారణను నాలుగు వారాల పాటు వాయిదా వేసింది సుప్రీంకోర్ట్. కాగా.. జస్టిస్ ఎన్వీ రమణ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం పోలవరంపై ఒడిశా దాఖలు చేసిన పిటిషన్లపై విచారణ జరుపుతున్న విషయం తెలిసిందే.