నేడు గవర్నర్ తో సీఎం జగన్ భేటీ

తెలుగు ఉమ్మడి రాష్ట్రాల గవర్నర్ నరసింహన్‌తో ఈరోజు ఏపీ సీఎం వైఎస్ జగన్ సమావేశం కానున్నారు. గవర్నర్‌ నరసింహన్‌  ఈరోజు  విజయవాడకు రానుండగా.. ఆయన బస చేసే హోటల్‌కు వెళ్లి ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి..  గవర్నర్‌ను  మర్యాద పూర్వకంగా కలవనున్నారుయ.

అదేవిధంగా ఈరోజు ఉదయం 11.30 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల మధ్య గవర్నర్.. సీఎం వైఎస్ జగన్ మధ్య ఈ సమావేశం జరగనుంది. రాష్ట్రంలోని ప్రస్తుత రాజకీయ పరిస్థితులు, కేంద్రం నుంచి రాష్ట్రానికి అందాల్సిన సాయంపై గవర్నర్ నరసింహన్‌తో  సీఎం వైఎస్ జగన్ చర్చించే అవకాశాలు మెండుగా ఉన్నట్లు తెలుస్తోంది.